మన పూర్వీకులు కూడా పెరుగు చక్కెరను కలిపి తినేవారు. నిజానికి పెరుగు చక్కెర కలిపి తినడం ఒక సంప్రదాయ పద్ధతికే కాదు, ఆరోగ్యానికి కూడా ఈ పద్ధతి ఎంతో ఉపయోగపడుతుంది. దీని వెనుక సైన్స్ కూడా దాగి ఉంది. పెరుగు చక్కెర కలిపి తినడం వెనక అనేక కారణాలు ఉన్నాయి, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని తినడం వలన మానసిక స్థిరత్వానికి అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడుతుంది. జ్యోతిష్యం ప్రకారం కూడా పెరుగు చక్కెర కలిపి తినడం శుభంగా భావిస్తారు. అందుకే ఎవరైనా కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టేటప్పుడు లేదా పరీక్షలు రాయడానికి వెళ్తున్నప్పుడు తినమని చెబుతారు.
పరీక్షలకు కానీ ఇంటర్వ్యూలకు కానీ వెళ్తున్నపుడు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో శరీరానికి కావాల్సిన శక్తి ఉండకపోవచ్చు. శరీరానికి శక్తి అవసరం, అలాగే మెదడు బాగా పని చేయాలంటే చక్కెర అవసరం. చక్కెర గ్లూకోస్ మూలంగా మెదడుకు తక్షణ శక్తిని అందిస్తుంది. పెరుగు మంచి ప్రొబయోటిక్, ఇది జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రెండింటినీ కలిపి తింటే శరీరం శక్తివంతంగా మారుతుంది, ఒత్తిడి కూడా తగ్గుతుంది.
హెల్త్కు పెరుగు సహాయపడుతుంది. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది. అలాంటి టైంలో పెరుగు చక్కెర తినడం వలన శరీరం మళ్ళీ బ్యాలెన్సులోకి వస్తుంది. పెరుగులో చక్కెర కలిపితే తక్షణ శక్తి లభిస్తుంది, శరీరానికి మేలు జరుగుతుంది. పెరుగు ఎసిడిటీని తగ్గించడంలో సహాయపడుతుంది. మనం తినే ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. అందుకే, ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు పెరుగు చక్కెర తినమని పెద్దలు చెప్తుంటారు.