అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో.. కేంద్ర హోం శాఖ కీలక సమీక్ష నిర్వహించారు. అమర్నాథ్ యాత్ర సన్నాహాలను సమీక్షించడానికి జమ్మూలో హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఇటీవలి పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూకశ్మీర్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు.

భారీగా సాయుధ దళాలను మోహరించారు కేంద్ర ప్రభుత్వం. జూలై 3వ తేదీ నుంచి ఆగస్టు 9 వరకు సాగనుంది యాత్ర.