పుష్ప సినిమా డైలాగ్ రాయడం కూడా తప్పేనా ? ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా ? అని ఫైర్ అయ్యారు వైస్ జగన్ మోహన్ రెడ్డి. పల్నాడు పర్యటన తరుణంలో జగన్ ప్రెస్ మీట్ పెట్టి స్పందించారు. చంద్రబాబుని కాలేజ్ టైంలో పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి కొట్టాడని ఆ కోపం ఇప్పటికీ కూడా పెట్టుకున్నాడని చురకలు అంటించారు.

అందుకే వాళ్ల కొడుకుని, రాంచంద్రారెడ్డిని అరెస్ట్ చేయాలి అని చంద్రబాబు అంటుంటాడు అన్నారు వైఎస్ జగన్. పొదిలిలో 40,000 మంది వైసీపీ కార్యకర్తలను, రైతులను అడ్డుకునేందుకు 40 మంది టీడీపీ కార్యకర్తలు వచ్చారని ఆగ్రహించారు. అదే 40,000 మంది 40 మంది మీద దాడి చేస్తే ఎలా ఉండేది ? అని తెలిపారు. దాడికి ప్రేరేపించింది టీడీపీ వాళ్ళైతే, కేసులు రైతుల మీద పెట్టించారు అని పేర్కొన్నారు వైఎస్ జగన్.
పుష్ప సినిమా డైలాగ్ రాయడం కూడా తప్పేనా ?
ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా ? – వైస్ జగన్ pic.twitter.com/QOoSiiwhpY
— Telugu Scribe (@TeluguScribe) June 19, 2025