ఏపీ నిరుద్యోగులకు శుభవార్త..వయోపరిమితి పెంపు.. వచ్చే ఏడాది వరకు పొడిగింపు

-

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది జగన్‌ సర్కార్‌. నిరుద్యోగుల వయో పరిమితి గడువును పొడిగిస్తూ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాన్-యూనిఫామ్ పోస్టుల వయోపరిమితిని ఏపీపీఎస్సీ గతేడాది 32 నుంచి 42 ఏళ్లకు పెంచింది.

Jagan Mohan Reddy government orders extending the age limit of unemployed

ఈ పెంపు దల ఈ ఏడాది సెప్టెంబర్ 30తో ముగియగా… వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సిఎస్ జవహర్ రెడ్డి జీవో జారీ చేశారు. ఏపీపీఎస్సీ సహా ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీలు చేపట్టే నియామకాలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.

కాగా, రేపు కాకినాడ జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. సామర్లకోటలోని జగనన్న కాలనీలో సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొనున్నారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.  రేపు ఒకేరోజు 5 లక్షల ఇళ్లు ప్రారంభించనున్నారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. రేపు పేదల చేతికి ఇళ్లు అందించనున్నారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version