నేడు సాయంత్రం ఒకే కార్యక్రమంలో జగన్, పవన్, చంద్రబాబు

-

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేటి సాయంత్రం ఓ అరుదైన ఘటన చోటు చేసుకోబోతుంది. ఏపీ సీఎం వైయస్ జగన్ – టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒకే వేదిక మీదకు రానున్నారు. వీరిద్దరితో పాటుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం అక్కడికే రాబోతున్నారు. ఈ అరుదైన కలయికకు రాజ్ భవన్ వేదిక కానుంది. స్వతంత్ర దినోత్సవం రోజు గవర్నర్ రాజభవన్ వేదికగా ” ఎట్ హోం” నిర్వహించడం ఆనవాయితీ.

దీంతో రాష్ట్రంలోని రాజకీయ, అధికార పలు రంగాల ప్రముఖులను గవర్నర్ ఆహ్వానించారు. వీరికి గౌరవార్థం గవర్నర్ తేనేటి విందు ఏర్పాటు చేశారు. ఈరోజు సాయంత్రం గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్ నిర్వహించే ఎట్ హోం కార్యక్రమానికి సీఎం జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీంతో ఇటు ఇరు పార్టీల కార్యకర్తల్లోనూ, జనాల్లోనూ ఉత్కంఠ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version