జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డి అరెస్ట్

-

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవర్ రమణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గత రెండు రోజుల క్రితం సత్తెనపల్లిలో పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి కారు కింద ఒక వ్యక్తి పడి మరణించాడు. ఈ విషయంపైన నల్లపాడు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి డ్రైవర్ రమణ రెడ్డిని అదుపులోకి తీసుకొని కారు కింద పడిన వ్యక్తిని మీరు గుర్తించలేదా ఆపకుండా అలానే ఎందుకు వెళ్లిపోయారు.

JAGAN
JAGAN

టైరు కింద వ్యక్తి పడినప్పుడు మీకు తెలియలేదా అని ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. కాగా, జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి కారు టైర్ కింద నలిగి చనిపోయిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇదిలా ఉండగా… వైయస్ జగన్మోహన్ రెడ్డి నివాసం వద్దకి కొంతమంది ఆకతాయిలు వచ్చి హంగామా సృష్టించారు. తాటికాయలు తెచ్చి జగన్మోహన్ రెడ్డి ఇంటి పైకి విసిరారు. అవి సెక్యూరిటీ బారికేడ్ల వద్ద పడడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ పోలీసులు పెద్దగా పట్టించుకోనట్లుగా తెలుస్తోంది. వెంటనే జగన్మోహన్ రెడ్డికి Z+ కేటగిరి భద్రత కల్పించాలని వైసిపి నేతలు కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news