మంత్రి కొండా సురేఖ ఆమె భర్త మురళికు ఉహించని షాక్ తగిలింది. మంత్రి కొండా సురేఖ ఆమె భర్త మురళిపై వరంగల్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో సమావేశమయ్యారు.

మంత్రి కొండా సురేఖ ఆమె భర్త మురళిపై ఆమెకు వారు ఫిర్యాదు చేశారు. అనంతరం జిల్లాలో తాజా పరిస్థితులను క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా పార్టీ నేతల సమన్వయంతో పనిచేయాలని మీనాక్షి స్పష్టం చేశారు. పార్టీని ఇబ్బంది పెట్టే అంశాలను ఉపేక్షించేది లేదని బదులిచ్చారు. మరోసారి నివేదికలు తెప్పించుకొని చర్యలు తీసుకుంటామని మీనాక్షి వెల్లడించారు. కాగా, కొండా సురేఖ ప్రస్తుతం దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.