తెలంగాణ వాసులకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి మరో ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈరోజు అదిలాబాద్, మంచిర్యాల, అసిఫాబాద్, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబాబాద్, హైదరాబాద్, మేడ్చల్, నల్గొండ, నాగర్ కర్నూల్, సూర్యాపేట జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

పిడుగులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలోని మిగతా ప్రాంతాలలో ఈదురు గాలులతో పాటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేస్తున్నారు.