ధనుంజయ రెడ్డి వల్లే ఓడిపోయాం – జక్కంపూడి రాజా

-

ధనుంజయ రెడ్డి వల్లే ఓడిపోయామని రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఓటమిపై జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ధనుంజయ రెడ్డి ఒక పనికిమాలిన చెత్త అధికారి ఆయన చుట్టూ ఎమ్మెల్యేలు ప్రదక్షిణాలు చేసిన పనులు కాకుండా అడ్డుకున్నారని ఆగ్రహించారు. ఉపాధి హామీ పనులకు కూడా బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు జక్కంపూడి రాజా.

Jakkampudi Raja

చిన్ననాటి నుంచి రాజకీయాలను చాలా దగ్గరగా చూశానని వివరించారు. రాజకీయాలు కింద పడటం .. లేవడం చాలా సార్లు చూసామన్నారు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. కానీ నేను చేసిన తప్పేంటో నన్ను ఎందుకు ఓడించారో తెలియడం లేదని వివరించారు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. రాజకీయాల్లో చూడాల్సింది ఇంకా చాలా ఉంది అని అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చివరి వరకు వైసీపీలోనే ఉంటానని ప్రకటించారు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.

Read more RELATED
Recommended to you

Latest news