స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు దొంగ ఉద్యమాలు చేస్తున్నాయి – జనసేన నేత

-

విశాఖ స్టీల్ ప్లాంట్ పై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు దొంగ ఉద్యమాలు చేస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆగిపోతే పవన్ కళ్యాణ్‌కు క్రెడిట్ వస్తుందని.. కార్మిక సంఘాలు దొంగ ఉద్యమాలు చేస్తున్నాయని బాంబ్‌ పేల్చారు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ.

Janasena leader Bolisetty Satyanarayana

విశాఖ స్టీల్ ప్లాంట్ సంక్షోభం వెనుక అసలు దోషులు వైసీపీ, కార్మిక సంఘాలు అంటూ ఫైర్‌ అయ్యారు. పవన్ కళ్యాణ్ అడిగినప్పుడు, సొంత నిధులు ఖర్చు పెట్టుకుని పోరాడినప్పుడు ముందుకు రాని పోరాట కమిటీ ఇప్పుడు ఎందుకు అపాయింట్ మెంట్ అడుగుతుందని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ జరగదని …..కానీ కేంద్రంపై పోరాట ధోరణితో సాధించేది ఏమీ ఉండదని తెలిసి కూడా వెయ్యి రోజుల విలువైన కాలాన్ని వృదా చేశారనే నేను నిలదేస్తున్నానని ఆయన అంటున్నా
రు.

Read more RELATED
Recommended to you

Latest news