గాంధీ ఆసుప‌త్రిలో 48 మంది చిన్నారులు, 14 మంది బాలింతలు మృతి..కేటీఆర్‌ సంచలనం !

-

గాంధీ ఆసుప‌త్రిలో 48 మంది చిన్నారులు, 14 మంది బాలింతలు మృతి చెందారని వస్తున్న వార్తలపై..కేటీఆర్‌ సంచలన పోస్ట్‌ పెట్టారు. 48 మంది ప‌సి గుడ్డులు… 14 మంది బాలింత త‌ల్లులు… ఊహించుకుంటేనే ఒళ్లు జ‌ల‌ద‌రిస్తోంది. ఈ రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఉందా? వ్య‌వ‌స్థ‌లు ప‌నిచేస్తున్నాయా…? అంటూ ఆగ్రహించారు.

ktr on gandhi hospital

ఎంతో మందికి ప్రాణం పోసిన గాంధీ ఆసుప‌త్రిలో ఇంత విషాదం ఎవ‌రి పాపం? ఆ పసిబిడ్డ‌ల ప్రాణాల‌కు విలువ లేదా? ఆ త‌ల్లుల గ‌ర్భ‌శోకానికి జ‌వాబు ఉండదా? అనిప్రశ్నించారు. త‌ప్పు చేయ‌క‌పోతే స‌ర్కారు ఈ లెక్క‌ల‌ను ఎందుకు దాస్తోంది… ఎందుకు భ‌య‌ప‌డుతోందని నిలదీశారు. ఆ త‌ల్లీబిడ్డ‌ల ఉసురు మీకు త‌గ‌ల‌దా… ఒక్క గాంధీలోనే ఇన్ని మ‌ర‌ణాలుంటే, రాష్ట్రంలో ప‌రిస్థితి ఏంటని ఆలోచిస్తేనే భ‌యంగా ఉందని పేర్కొన్నారు.

గ‌ర్భిణీల‌కు న్యూట్రిష‌న్ కిట్లు, డెలివ‌రీ అయితే కేసీఆర్ కిట్లు, సిజేరియ‌న్ కాకుండా నార్మ‌ల్ డెలివరీల‌కు ప్రాధాన్య‌త ఇస్తూ త‌ల్లి, బిడ్డ‌ను ఇంటి దగ్గ‌ర దిగ‌బెట్టి వ‌చ్చేలా కేసీఆర్ వ్య‌వ‌స్థ‌ల‌ను త‌యారు చేశారు. అది ఓ పాల‌కుడిగా ప్ర‌జ‌ల బాధ్య‌త తీసుకోవ‌టం. మ‌రీ మ‌న చీప్ మినిస్ట‌ర్ ఏం చేస్తున్నారో…? పాల‌న గాలికి వ‌దిలి, ప్ర‌చారా ఆర్భాటాలు, విగ్ర‌హ రాజ‌కీయాలు చేస్తే ఇలాగే ఉంట‌దన్నారు కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news