Chandrababu : చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై నేడు తీర్పు

-

Chandrababu : స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మద్యంతర బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ పై నేడు హైకోర్టు నిర్ణయం వెల్లడించనుంది. నిన్న ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును నేటికీ వాయిదా వేశారు. ఈ నిర్ణయం ఆధారంగా ప్రధాన బెయిల్ పిటిషన్ పై విచారణ ఉండనుంది.

తోలుత ఏసీబీ కోర్టు బెయిల్ నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టుకు వెళ్లారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఇది ఇలా ఉండగా, చంద్రబాబుపై సీఐడీ మరో కేసు నమోదు చేసింది. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలపై పీసీ యాక్ట్ కింద కేసు ఫైల్ చేసింది. బాబును ఏ3గా చేరుస్తూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై విచారణకు కోర్టు అనుమతించింది. బాబు ఇప్పటికే స్కిల్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి జైలులో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news