కందుకూరు మరణాలు.. చంద్రబాబు చేసిన హత్యలే – మంత్రి కాకాణి

-

చంద్రబాబు అధికార దాహం వల్లే ప్రమాదమని మంత్రి కాకాణి ఫైర్‌ అయ్యారు. లేనిది ఉన్నట్లు చూపించే ప్రయత్నం వల్లే దుర్ఘటన అని.. ఎక్కువ మందిని చూపించడానికి కందుకూరులో సభ పెట్టారని నిప్పలు చెరిగారు. ఎన్ని పొరపాట్లు చేయకూడదో చంద్రబాబు అన్ని చేశారని.. 8 మందిని చంద్రబాబు పొట్టనపెట్టుకున్నారని ఫైర్‌ అయ్యారు.


సభకు వస్తే కూలీ ఇస్తారని వచ్చినవాళ్లు చనిపోయారు… చంద్రబాబు అధికార దాహం వల్లే కందుకూరు ప్రమాదం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కాకాణి. లేనిది ఉన్నట్లు చూపే ప్రయత్నం వల్లే ప్రమాదం జరిగింది.. ఇరుకు సందులో బస్సు యాత్ర పెట్టారని నిప్పులు చెరిగారు. డ్రోన్ షాట్ల కోసం బలవంతంగా తరలించిన జనంతో చంద్రబాబు సభ పెట్టారు.. రెండు పక్కల ఫ్లెక్సీలు పెట్టి మధ్యలోకి జనాన్ని తోలారు.. ఇవి చంద్రబాబు చేసిన హత్యలే అని ఆగ్రహించారు. చంద్రబాబుపై కేసు పెట్టాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version