అనంతపురంలో కిడ్నాప్ కలకలం.. కానిస్టేబులే చేశాడా ?

-

అనంతపురంలో ఓ యువతిని కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. అనంతపురం ఆజాద్ నగర్‌ కి చెందిన జ్యోతి కిడ్నాప్ కు గురైంది. కారులో వచ్చిన దుండగులు జ్యోతిని బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఆజాద్ నగర్‌ ఆరో రోడ్డుకి చెందిన కార్పెంటర్ కూతురు జ్యోతికి కర్నూలు జిల్లా కొలిమిగుండ్లకు చెందిన భగీరథతో గతంలో వివాహం నిశ్చయించారు. భగీరథ అవుకు పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే, ఇరు కుటుంబాల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఈ ఇరువురూ వివాహం రద్దు చేసుకున్నారు. నిన్న సాయంత్రం జ్యోతి మరో మహిళతో కలసి టైలర్ వద్దకు బయలు దేరింది. ఆ సమయంలో కారులో వచ్చిన గుర్తు తెలియని దుండగులు ఆమెను కిడ్నాప్ చేశారు. బలవంతంగా కారులోకి లాక్కుని తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. యువతి ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు కొన్ని టీమ్స్ ని ఏర్పాటు చేసి మరీ గాలింపు చర్యలు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news