చంద్రబాబుకు లలిత జ్యూయెలర్స్ భారీ సాయం..డబ్బులు ఊరికే రావంటూ !

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం సహయ నిధికి విరాళాల వెల్లువ కొనసాగుతూనే ఉంది. వరద సాయం కోసం ప్రభుత్వానికి చేయూతనిస్తూ ఇప్పటికే వివిధ వర్గాల నుంచి విరాళాలు వస్తోన్నాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సీఎం చంద్రబాబుకు రూ. కోటి విరాళం అందించారు లలితా జ్యూయెలర్స్ అధినేత కిరణ్. రూ. 5 లక్షలు చొప్పున సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం ఇచ్చాయి అంగర రామ్మోహన్, బెస్ట్ అగ్రో లైఫ్ యాజమాన్యం.

Kiran is the head of Lalita Jewelers who donated to CM Chandrababu

ఇక ఈ సందర్భంగా లలిత జ్యూయెలర్స్, ఎండీ కిరణ్ మాట్లాడుతూ…. ఏపీలో భారీ వర్షాలు 6 లక్షల మంది ప్రజలపై ప్రభావం చూపించిందని వెల్లడించారు. ఏపీ సీఎం చంద్రబాబు 74 ఏళ్ల వయసులో చాలా కష్ట పడతున్నారని కొనియాడారు. ప్రజలకు మనం చేసే సాయం మరింత ఉపయెగపడుతుందని తెలిపారు లలిత జ్యూయెలర్స్, ఎండీ కిరణ్. ఎవరి శక్తిని బట్టి అందరూ సాయం చేయాలని కోరారు. ఇలాంటి సమయాల్లో సాయం చేయకుంటే మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఉపయేగం లేదన్నారు లలిత జ్యూయెలర్స్, ఎండీ కిరణ్.

Read more RELATED
Recommended to you

Latest news