కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు కర్నూలు వాసులు మృతి

-

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. వీరంతా ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు వాసులుగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని దావణగెరి వద్ద టెంపో వాహనం టైర్‌ పంక్చరై అదుపు తప్పింది. ఈ ఘటనలో కర్నూలు జిల్లాకు చెందిన ముగ్గురు మిర్చి రైతులు మృతి చెందారు. మృతులను పెద్దకడుబూరు మండలం నాగలాపురానికి చెందిన మస్తాన్‌, పెద్ద వెంకన్న, మంత్రాలయం మండలం శింగరాజనహల్లికి చెందిన ఈరన్నలుగా గుర్తించారు. మిర్చి లోడ్‌తో టెంపోలో బ్యాడిగి మార్కెట్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వాహనం టైర్ పంక్చర్ అయి అదుపు తప్పడంతోనే ప్రమాదం చోటుచేసుకుందని వెల్లడించారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version