రోజాకు బండారు క్షమాపణ చెప్పే వరకు నేను పోరాడుతా – నటి ఖుష్బూ

-

రోజాకు బండారు క్షమాపణ చెప్పే వరకు నేను పోరాడుతానంటూ సినీ నటి ఖుష్బూ ప్రకటించారు. గత నాలుగు రోజుల కిందట ఏపీ మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఏమీ మంత్రి రోజా బ్లూ ఫిల్మ్స్‌ ఉన్నాయంటూ టీడీపీ నేత బండారు సత్యనారాయణ ఆరోపణలు చేశారు. అయితే.. రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై సినీ నటి ఖుష్బూ సీరియస్‌ అయ్యారు.

kushboo reacts on bandaru sathyanarayana comments
kushboo reacts on bandaru sathyanarayana comments

మంత్రి రోజా పై టీడీపీ నేత బండారు సత్యనారాయణ అనుచిత వ్యాఖ్యల పై స్పందించిన సినీ నటి ఖుష్బూ…క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. మంత్రి రోజా పై టీడీపీ నేత బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు. రోజాకు నా పూర్తి మద్దతు ఉంటుందని…. రోజాకు బండారు క్షమాపణ చెప్పే వరకు నేను పోరాడుతానన్నారు. రాజకీయ నాయకుడి గానే కాదు మనిషిగా కూడా బండారు విఫలమయ్యాడని ఫైర్‌ అయ్యారు. నారీ శక్తి వంటి చట్టాలను దేశంలో తెచ్చుకుంటున్న సందర్భం ఇది. మహిళల గురించి నీచంగా మాట్లాడటం తమ జన్మ హక్కు అనుకుంటున్నారు బండారు సత్యనారాయణమూర్తి వంటి వ్యక్తులు అంటూ ఖుష్బూ నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news