ఎన్టీఆర్ అధికారాన్ని లాక్కున్న వాళ్ళు వారసులు ఎలా అవుతారు? – లక్ష్మీ పార్వతి

-

చంద్రబాబు చేతిలో చనిపోయిన వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి. ఏ కులం వారితో అయినా స్నేహం చేయవచ్చని… దేశంలో గుణం లేని ఏకైక వ్యక్తి చంద్రబాబు అని ఫైర్‌ అయ్యారు. దేశంలో ఏ దిక్కుకైనా వెళ్ళవచ్చు.. కానీ దిక్కుమాలిన చంద్రబాబు వైపు వెళ్ళకండని కోరారు. ఇంత అద్భుతంగా ఎన్టీఆర్ కార్యక్రమం జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు.. అప్పట్లో నా గొంతు వినిపించకుండా మీడియా అడ్డుకుందన్నారు.

జగన్ వల్ల నా గొంతును ఇంత మంది వింటున్నారు.. నా జీవితంలో ముగ్గురికి నేను కృతఙ్ఞతలు చెప్పాలని వెల్లడించారు. నోటి మాట రాని లోకేష్ కూడా వారసుడిని అంటున్నాడు… ఎన్టీఆర్ అధికారాన్ని లాక్కున్న వాళ్ళు వారసులు ఎలా అవుతారు?? అని ఆగ్రహించారు. సొంత మనుషులే వెన్నుపోటు పొడవటంతో ఎన్టీఆర్ ఎంతో ఆవేదన చెందారు..మోసం చేసిన చంద్రబాబును అండమాన్ జైలుకు పంపిస్తానని ఎన్టీఆర్ తీర్మానం చేశారన్నారు. చంద్రబాబుకు ఎన్టీఆర్ పేరు పలికి అర్హత లేదని.. ఎన్టీఆర్ ఆశయాలను మట్టిలో కలిపేశాడని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news