పప్పూ నిద్ర వదులు…నారా లోకేష్ జగన్ సంచలనం !

-

అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు అంటూ నారా లోకేష్ పై జగన్ మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీఈసెట్‌ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ అని మండిపడ్డారు. ఈసెట్‌ రిజల్ట్స్‌ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్‌ ప్రారంభం కాలేదన్నారు జగన్.

nara lokesh VS  ycp jagan
Nara Lokesh controversial comments on TDP former sarpanch

మరోవైపు రేపటి నుంచి ఇంజినీరింగ్‌ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతున్నాయని చెప్పారు. ఇంజినీరింగ్ రెండో ఏడాదిలో అడ్మిషన్లకోసం 34వేల మంది పాలిటెక్నిక్‌ విద్యార్థులు ఈసెట్‌ పరీక్షలు రాస్తే అందులో 31,922 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు జగన్. గతనెల మే 15న ఫలితాలు వెలువడినా, ఇప్పటికీ కౌన్సెలింగ్‌ ప్రక్రియపై షెడ్యూల్‌ విడుదలచేయకపోవడం, ఆ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడం, విద్యావ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనం అని రెచ్చిపోయారు జగన్ మోహన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news