ఏపీలో రామరాజ్యాన్ని తెచ్చుకుందాం..అయోధ్యలా మార్చుదాం – నారా లోకేష్‌

-

ఏపీలో రామరాజ్యాన్ని తెచ్చుకుందాం..అయోధ్యలా మార్చుదామని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌ పేర్కొన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా నారా లోకేష్‌ ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు లోకేష్‌.

” పాలకుడికి అహంకారం ఉంటే రాజ్యం ఎలా దహించుకు పోతుందో చెప్పడానికి ఆనాటి లంక ఉదాహరణ. అలాగే పాలకులకి ముందుచూపు లేకపోతే ఆ రాజ్యంలో రావణ కాష్టం ఎప్పుడైనా రగులుకోవచ్చని అని చెప్పడానికి నేటి లంక ఉదాహరణ. ఏపీని లంకలా కానివ్వకుండా అయోద్యలా చూసుకుందాం. రామరాజ్యాన్ని తిరిగి తెచ్చుకుందాం. ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు” అని జగన్‌ సర్కార్‌ ను ఉద్దేశించి ఈ ట్వీట్‌ చేశారు నారా లోకేష్‌.

ఇక అంతకు మందు ట్వీట్‌ లో “గల్లీ నుండి ఢిల్లీ వరకూ పనికిమాలినోడని తేలిపోయిన తరువాత ఫ్రస్టేషన్ కాకపోతే ఫన్ వస్తుందా? వెంట్రుక మహరాజ్.. ఈకల ఎంపరర్ సీఎం జగన్‌ గారూ మీ వెంట్రుకలు పీకే ఓపిక, తీరిక మాకు లేవు. మీ నవరంధ్ర పాలన నుంచి ప్రజలను ఎలా గట్టెక్కించాలనే ఆలోచనలతో మేము పనిచేస్తున్నాం” అంటూ ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version