హైకోర్టులో లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్

-

ఏపీ హైకోర్టులో నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అమరావతి ఇన్నర్ రింగ్ కేసులో లోకేష్ ను సిఐడి A-14గా చేర్చడంతో ఆయన కోర్టుకు వెళ్లారు. కాగా, ఈ కేసులో A-1గా ఉన్న చంద్రబాబు ఇప్పటికే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు హైకోర్టులో దానిపై విచారణ జరగనుంది.

ఇది ఇలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17 ఏ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ మంగళవారం విచారణకు రానుందని భావించినా.. బుధ వారానికి వాయిదా పడింది.

Read more RELATED
Recommended to you

Latest news