చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య ఆత్మహత్య

-

కాంగ్రెస్‌ పార్టీలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన భార్య రూపాదేవి గురువారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయం అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ అల్వాల్ లో పంచశీల కాలనీలోని ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.

medipally sathyam wife died

బలవన్మరణానికి కారణాలు తెలియరాలేదు. ఎమ్మెల్యే దంపతులకు ఇద్దరు పిల్లలు. ఆమె రెండు రోజుల నుండి స్కూలుకు వెళ్లలేదు. ఎమ్మెల్యే ఉదయమే నియోజకవర్గానికి వెళ్లారు. సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే కుటుంబం ఇతర బంధువులతో కలిసి తిరుమల సహా పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకుని వచ్చారు. రూపా దేవి మృతదేహాన్ని పోలీసులు కొంపల్లిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news