175 స్థానాల్లో పోటీ చేసేందుకు టిడిపికి అభ్యర్థులే లేరు – మంత్రి మేరగ నాగార్జున

-

175 స్థానాల్లో పోటీ చేసేందుకు టిడిపికి అభ్యర్థులే లేరంటూ ఎద్దేవా చేశారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరగ నాగార్జున కామెంట్స్ చేశారు. పేద ప్రజల కోసం జగన్ నిరంతరం పనిచేస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభంజనం కొనసాగుతుందని వెల్లడించారు. జగన్ ను ఎవరూ అడ్డుకోలేరని.. దళితుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను జగన్ అమలు చేస్తున్నారన్నారు.

ఉన్నత కులాల్లోని పేదవారిని కూడా ఆదుకుంటున్నారని.. చంద్రబాబు మా కులాలను ద్వేషించారని ఫైర్‌ అయ్యారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని అన్నారని.. మమ్మల్ని పలుమార్లు అపహాస్యం చేశారని విమర్శలు చేశారు. దళితుల మీద దాడులు, అఘాయిత్యాలు చంద్రబాబు హయాంలో జరిగాయని విమర్శలు చేశారు. వాటిని దళితులు మర్చిపోలేరని.. దళితులకు ప్రయోజనం కలిగించే చట్టాలను చంద్రబాబు చుట్టాలుగా మార్చుకున్నారని ఫైర్‌ అయ్యారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరగ నాగార్జున.

Read more RELATED
Recommended to you

Latest news