లిక్కర్ పాలసీ పై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

-

లిక్కర్ పాలసీ పై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా  రాజమండ్రిలో మంత్రి అచ్చెన్నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడారు.  లిక్కర్ పాలసీ పై జగన్ పిచ్చి కుక్కల లా మాట్లాడుతున్నాడు.  లిక్కర్ లో 40 వేలకోట్లు దోచుకున్నావు.  60 రూపాయలు ఉన్న క్వార్టర్ బాటిల్ 250 కి అమ్ముకున్నాడు. 90వేల దరఖాస్తులు మద్యం కోసం వస్తే 1800 కోట్ల ఆదాయం వచ్చింది.  అసలు మద్యం గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదన్నారు అచ్చెన్నాయుడు. మద్యం తయారీ, అమ్మకం దగ్గర పెట్టుకుని జగన్ అడ్డంగా దోచుకున్నాడు.

ఒక ప్రణాళిక బద్దంగా పని చేస్తుంది కూటమి ప్రభుత్వం అన్నారు. కూటమి ప్రభుత్వానికి 120 రోజులు అయ్యింది. వెంటిలేటర్ మీద ఉంది.. రాష్ట్రంలో వ్యవస్థలను సర్వ నాశనం చేసారు. చేతులు జోడించి నమస్కరిస్తాం. పార్టీని గెలిపించారు. పీఎం మోడీ సహకారంతో సహకారం అందించారు. అందువల్లే వెంటిలేటర్ మీద నుంచి ఆక్సిజన్ పీల్చుకునే స్థాయికి వచ్చామని తెలిపారు. పెన్షన్ పెంచి 4వేలు ఇచ్చామి గుర్తు చేశారు అచ్చెన్నాయుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version