కన్నా లక్ష్మీనారాయణపై మంత్రి అంబటి రాంబాబు ఫైర్

-

టిడిపి నేత కన్నా లక్ష్మీనారాయణపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి అంబటి రాంబాబు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే హక్కు కన్నా లక్ష్మీనారాయణకు లేదని అన్నారు. పదవి కోసం పాకులాడే వ్యక్తి అంటూ కన్నా పై తీవ్ర ఆరోపణలు చేశారు అంబటి. సీఎం జగన్ పై అవాకులు, చెవాకులు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.

ఎన్నికల ఖర్చు కోసం బిజెపి ఫండ్ పంపితే మింగిన ఘనత కన్నాది అని ఆరోపించారు. ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. గతంలో చంద్రబాబును తిట్టి ఇప్పుడు ఆయన బొమ్మలకే కన్నా పాలాభిషేకం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబుపై చేసినట్లుగా వైసీపీ పై వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. కన్నా సంగతి అమిత్ షాని అడిగితే బాగా చెబుతారు అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version