జగన్ కంచుకోటని ఇంచు కూడా కదల్చలేరు – మంత్రి జోగి రమేష్

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేసారు మంత్రి జోగి రమేష్. ఏ పార్టీ అధ్యక్షుడైన తానే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాడు కానీ.. పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబును ముఖ్యమంత్రి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జెండా, అజెండా లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని.. వెయిటింగ్ వీసా పై రాష్ట్రానికి వచ్చి ఏదో ఆగిపోతుంటాడని వ్యాఖ్యానించారు.

వారానికి ఒకసారి రాష్ట్రానికి వచ్చి జనాన్ని రెచ్చగొడుతున్నాడని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కి తెలిసిందల్లా చంద్రబాబు కి చెంచాగిరి చేయడమేనని విమర్శించారు. పవన్ కి ధైర్యం ఉంటే ఏపీలోని 175 నియోజకవర్గాలలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. వారాహి మీద కాకుంటే వరాహం మీద తిరగాలంటూ ఎద్దేవా చేశారు. పవన్ కాదు కదా.. ఆయన దత్తతండ్రి చంద్రబాబు వచ్చిన వైసీపీ కంచుకోటని ఇంచుకూడా కదల్చలేరని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version