మంత్రివర్గంలోకి నారా లోకేశ్‌.. చంద్రబాబు నిర్ణయం

-

టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ రాష్ట్ర మంత్రివర్గంలో చేరనున్నట్లు సమాచారం. ఆయనకు ప్రాధాన్యమున్న మంత్రిత్వశాఖల బాధ్యతలు అప్పగించే అవకాశముందని పార్టీ వర్గాల టాక్. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సుదీర్ఘ పాదయాత్ర చేసి ఎన్డీయే విజయంలో కీలక భూమిక పోషించిన లోకేశ్‌ ఒక సందర్భంలో.. ఎన్నికల్లో గెలిచాక మంత్రివర్గంలో చేరడం కన్నా పార్టీపరంగా బాధ్యతలు తీసుకుంటానని ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే ఇటీవల మీడియాతో మాట్లాడుతూ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానని అన్నారు. తాజాగా పార్టీ అధినేత చంద్రబాబు ఈ విషయంపై స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. బయట ఉంటే కీలక విధాన నిర్ణయాలు, వాటి అమల్లో భాగస్వామ్యం ఉండదన్న ఉద్దేశంతోనే మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఐటీ, పంచాయతీరాజ్‌శాఖల మంత్రిగా లోకేశ్‌ బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి నారా లోకేశ్ ప్రభుత్వంలో మరింత కీలక భూమిక పోషించే అవకాశముంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version