గుంటూరులో ఆటో నడిపిన మంత్రి విడదల రజిని

-

గుంటూరులో ఆటో నడిపారు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. గుంటూరులోని ప‌ట్టాభిపురం స్వామి థియేట‌ర్ ప్రాంగ‌ణంలో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి విడ‌ద‌ల ర‌జిని ఆధ్వర్యంలో ఆటో డ్రైవ‌ర్ల‌తో ఆత్మీయ స‌మావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ…ఆటో అన్న అంటే అంద‌రివాడన్నారు.

Vidadala Rajini who drove an auto in Guntur

ఆ అంద‌రివాడికి తోడు జ‌గ‌న‌న్న‌ అని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హ‌యాంలో ఆనందంగా జీవ‌నం అని తెలిపారు. అణిచివేత‌లు లేవు, అప‌రాధ‌రుసుములు లేవు… ఆటో డ్రైవ‌ర్ల మ‌నోభావాల‌కు త‌గిన‌ట్లుగానే వైసీపీ ప్ర‌భుత్వం ప‌నిచేస్తుందని కొనియాడారు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని. స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి నా వంతు కృషి చేస్తానని…హామీ ఇచ్చారు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని.

Read more RELATED
Recommended to you

Latest news