హిందూపురంలో ఓటు వేసిన బాలకృష్ణ దంపతులు

-

తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఏపీలోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో సోమవారం ఓటింగ్‌ కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 9 గంటల వరకు లోక్‌సభకు ఏపీలో 9.05శాతం పోలింగ్‌ నమోదైంది. ఏపీలో అత్యధికంగా వైఎస్‌ఆర్‌ జిల్లాలో 12.09శాతం, అత్యల్పంగా గుంటూరులో 6.17శాతం ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. తొలి రెండు గంటల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు 9.21శాతం ఓటింగ్‌ నమోదైంది.

మరోవైపు ఏపీలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు తమ కుటుంబంతో కలిసి ఓటు వేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాజాగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన సతీమణి వసుంధరతో కలిసి ఓటు వేశారు. ఆర్టీసీ కాలనీ పోలింగ్‌ కేంద్రంలో బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version