రోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్సీ పర్వతారెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి తీవ్రగాయాలు

-

MLC Parvathar Reddy : రోడ్డు ప్రమాదంలో..వైసీపీ ఎమ్మెల్సీ పర్వతారెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా కొడవలూరు దగ్గర టైర్ పేలి ఎమ్మెల్సీ పర్వతారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కారును ఢీకొట్టింది ఓ లారీ. ఈ ప్రమాదంలో పర్వతారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పీఏ మృతి చెందాడు. పర్వతారెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి, కారు డ్రైవర్‌కి తీవ్రగాయాలు అయ్యాయి.

MLC Parvathar Reddy Chandrasekhar Reddy seriously injured

కొడవలూరు మండలం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని నెల్లూరు అపోలో ఆసుపత్రికి తరలించారు. వైసీపీ ఎమ్మెల్సీ పర్వతారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తలకు గాయం కావడంతో వివిధ పరీక్షలు చేస్తున్నారు వైద్యులు. వైసీపీ ఎమ్మెల్సీ పర్వతారెడ్డి చంద్రశేఖర్ రెడ్డికు ప్రాణాపాయంలేదని వెల్లడించారు. పరీక్షల ఫలితాల ఆధారంగా అవసరమైతే చెన్నైఅపోలో కు తరలించనున్నారు. అటు ఎమ్మెల్సీని పరామర్శించేందుకు ఆసుపత్రికి చేరుకుంటున్నారు వైసీపీ నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news