వైజాగ్ నగరంలో నిర్మించబోయే సెక్రటేరియట్ నమూనా

-

కాగా, తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో తలసరి ఆదాయం పెరిగిందన్నారు సీఎం జగన్. సేవా రంగంలో ఏపీ దూసుకుపోతుంది..ఉత్పత్తి రంగంలో చాలా మెరుగ్గా ఉన్నామన్నారు. హైదరాబాద్ కంటే కూడా భవిష్యత్తులో వైజాగ్ అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు సీఎం వైఎస్ జగన్. ఎన్నికల తర్వాత రాజధాని వైజాగే…ఇక్కడే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తానంటూ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.

Model Secretariat to be built in Vizag city

విశాఖ జిసిఎంసీ పరిధిలో 1500కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి జగన్‌….అనంతరం మాట్లాడారు. వచ్చే ఎన్నికల అనంతరం వైజాగ్ నుంచి పాలన సాగిస్తానని… మళ్లీ గెలిచి వచ్చాక వైజాగ్ లోనే ప్రమాణ స్వీకారం చేస్తానని వెల్లడించారు. విశాఖ అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉంటానని చెప్పారు సీఎం జగన్. నాయకుడి ఆలోచన తప్పుగా ఉంటే విశాఖ అభివృద్ధి చెందదన్నారు. స్వార్థ ప్రయోజనాల వల్ల విశాఖ….ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news