ఓ జవాన్ చనిపోయి రోడ్డు మీద ఉన్నా పట్టించుకోని జనం !

-

మానవత్వం చచ్చిపోయింది. ఓ జవాన్ చనిపోయి రోడ్డు మీద ఉన్నా జనం పట్టించుకోవడం లేదు. ఓ జవాన్ చనిపోయిన సంఘటన నిన్న జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ – గోల్కొండ ఆర్టిలరీ కేంద్రంలో విధులు నిర్వహించే ఆర్మీ జవాన్ కునాల్ ఔటర్ రింగ్ రోడ్డుపై నార్సింగి వద్ద నిలబడి ఉండగా రెడీ మిక్సర్ వాహనం ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది.

People who don’t care if a jawan is dead on the road

వాహనదారులు రోడ్డుపై మృతదేహాన్ని చూసినా ఆపకుండా కనీసం అటువైపు చూసే ప్రయత్నం చేయలేదు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. కునాల్ ను రెడీ మిక్సర్ వెహికిల్ ఢీ కొన్నట్లుగా గుర్తించారు పోలీసులు. ఇక ఆ లారీని గుర్తించి.. డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రమాద సమయంలో సీసీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్న పోలీసులు… డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news