సీఎం జగన్ భారీ స్కెచ్..20 మంది ఎమ్మెల్యేలకు ఎంపీ టికెట్లు ?

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మరో రెండు లేదా మూడు నెలల్లో జరగనున్నాయి. దీంతో ఏపీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ చేశాయి. ముఖ్యంగా అధికార వైసిపి పార్టీ మరోసారి అధికారంలోకి రావాలని వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే టికెట్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.

MP tickets for 20 MLAs

వైసీపీ పార్టీలో ఎంపీలకు ఎమ్మెల్యే టికెట్లు… ఎమ్మెల్యేలకు ఎంపీ టికెట్లు ఇచ్చేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారట. ఇందులో భాగంగానే 15 మంది ఎంపీలకు అసెంబ్లీ టికెట్లు ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. అలాగే 20 మంది ఎమ్మెల్యేలకు ఎంపీ టికెట్లు ఇవ్వడానికి సిద్ధమయ్యారట. అటు 30 మందికి పైగా కొత్తవారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. వై నాట్ 175 పేరుతో జగన్మోహన్ రెడ్డి గెలుపు గుర్రాలపై ఫోకస్ చేశారట. ఇందులో భాగంగానే వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టులో భారీ మార్పులు చేసేందుకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం అందుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version