టీటీడీ ఛైర్మన్‌ పదవిపై నాగబాబు క్లారిటీ

-

సినీ నటుడు, పవన్‌కల్యాణ్‌ సోదరుడు నాగబాబు తిరుమల, తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్‌ పదవిని చేపట్టబోతున్నారంటూ నెట్టింట వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం నుంచి ఈ వార్త ట్రెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై నాగబాబు ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఈ పుకారుపై క్లారిటీ ఇచ్చారు. మరోవైపు తన భవిష్యత్‌ కార్యాచరణనూ వెల్లడించారు.

‘దయచేసి అసత్య వార్తలను ఎవరూ నమ్మకండి. పార్టీ అధికారిక, నా సోషల్‌మీడియా ఖాతాల ద్వారా పోస్ట్‌ అయ్యే సమాచారాన్ని మాత్రమే విశ్వసించండి. దయచేసి ఫేక్‌ న్యూస్‌ను ప్రచారం చేయకండి’ అని పేర్కొన్నారు. పార్టీకి సేవ చేయడం తప్ప పదవులపై తనకు ఆలోచన లేదని అన్నారు. జనసేనను ఇంకా ఉన్నతస్థానాలకు ఎలా తీసుకెళ్లాలా? అన్న ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. అలాగే క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం పైనా దృష్టి పెడతామని స్పష్టం చేశారు.

మరోవైపు చిరంజీవి ఇంటికి పవన్‌కల్యాణ్‌ చ్చిన సందర్భంగా జరిగిన సెలబ్రేషన్స్‌లోనూ నాగబాబు కుటుంబం పాల్గొంది. ఎన్నికల్లో కల్యాణ్‌బాబు విజయం సాధించిన సందర్భంగా కుటుంబసభ్యులంతా కలిసి గెట్‌ టు గెదర్‌లా చిన్న పార్టీ చేసుకున్నామని ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version