మా కుటుంబం టీడీపీలో చేరటానికి సిద్ధంగా ఉన్నాం – ఎంపీ మాగుంట

-

మా కుటుంబం టీడీపీలో చేరటానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. ఇవాళ ప్రకాశంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ…టీడీపీ అధినేత చంద్రబాబు సూచనలతో ఉమ్మడి జిల్లాలోని ముఖ్య నేతలు మాగుంట కుటుంబాన్ని పార్టీ లోకి ఆహ్వానించారన్నారు.

Ongole MP Magunta Srinivasulareddy

మా కుటుంబం టీడీపీ లోకి చేరటానికి సిద్ధంగా ఉన్నాం..టీడీపీ, జనసేన అధినేతల అనుమతితో పార్టీలో చేరతామని వివరించారు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. ఎక్కడ పార్టీలో చేరతామనే విషయం ప్రకటిస్తామని తెలిపారు.

నాకు రిటైర్మెంట్ కోసం ఒక వయస్సు వచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబుకు చెప్పామన్నారు. మా కుమారుడు రాఘవరెడ్డి వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తారని వివరించారు. టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ కూడా చేరటం అద్భుత కలయిక అని… ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ నేతలతో కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news