ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం అన్న సంగతి తెలిసిందే. ఈ యోగా దినోత్సవం కార్యక్రమాన్ని.. విశాఖపట్నంలో చాలా అట్టహాసంగా నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ. అంతర్జాతీయ యోగా దినోత్సవం లో పాల్గొన్నారు. ఈ మేరకు ఏపీ సర్కార్… ప్రధాని నరేంద్ర మోడీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

ఈ సందర్భంగా ఆసక్తికర సంఘటన ఒకటి జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీకి గిఫ్ట్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు పోటీపడ్డారు. లక్ష్మీనరసింహస్వామి ప్రతీక ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారు. అయితే తానే ముందు ఇస్తానంటూ.. చంద్రబాబు కాస్త ఆసక్తి చూపించారు.
ఈ నేపథ్యంలోనే… అక్కడ ఆసక్తికర సంఘటన జరిగింది. ఇక అంతకుముందు శాలువా… చంద్రబాబు నాయుడు ఒక్కడే కప్పారు. అనంతరం తానే ముందు ప్రతీక ఇస్తానని… పవన్ కళ్యాణ్… ముందు అడుగు వేశాడు. కానీ అంతలోనే చంద్రబాబు కూడా ఆ ప్రతికను పట్టుకొని ప్రధాని నరేంద్ర మోడీకి ఇచ్చారు. దీనిపై దారుణంగా ట్రోలింగ్ జరుగుతుంది.
జాతి రత్నాలు😂 pic.twitter.com/dK4wlCDKHL
— Aalochinchu (@aalochinchu) June 21, 2025