జనసేన B టీం అయితే వైసీపీ మర్డర్ టీం – పవన్ కళ్యాణ్

-

జనసేన B టీం అయితే వైసీపీ మర్డర్ టీం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. తాడేపల్లిగూడెం ,తణుకు నియోజకవర్గాలకు చెందిన వీర మహిళలు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ.. వైసిపి వాళ్ళు జనసేనని బి టీం అంటుంటే బయటి వాళ్లు అనడం వేరు.. మనవాళ్లు అనడం వేరన్నారు.

బయటి వాళ్లు కంటే జనసేన నాయకులు నన్ను నమ్మకపోవడం ఇబ్బంది.. మనవాళ్లు నన్ను సందేహిస్తారని తెలిపారు. రాజకీయాల్లో ప్రలోభాలు ఉంటాయి.. వాటిని దాటుకుని వెళ్లడమే నైతిక రాజకీయం అని చెప్పారు. సోషల్ మీడియాలో లేదా నేరుగా మన పైన జరుగుతున్న దాడికి ఎదురు దాడి చేయడం నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. 2008లో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రారంభించాను అప్పటికి రాజకీయ పార్టీ ప్రారంభం కాలేదని.. తర్వాత మొదలైన పార్టీని జాతీయ పార్టీలో కలిపేస్తే నేను ఒక్కసారి కూడా ఢిల్లీ వెళ్లలేదని చెప్పారు. ఒక సిద్ధాంతాన్ని నమ్మితే చచ్చే వరకు అది కొనసాగించడమే..పార్టీని నడపడానికి వేల కోట్లు ఉంటే సరిపోదని వివరించారు పవన్‌ కళ్యాణ్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version