సిబిఐ విచారణకు సిద్ధమంటున్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు

-

తన అవినీతి, అక్రమాలపై సిబిఐ విచారణ చేయాలని తనకు తానుగా స్వచ్ఛందంగా కోరబోతున్నానని తెలిపారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు. పొదుపు సంఘాల మహిళలను మోసం చేసిన టిడిపి మహిళా నేత వద్ద నుంచి డబ్బు ఇప్పించాలని టిడిపి ఇంచార్జీ ప్రవీణ్ ఇంటి వద్దకు వెళితే అతను మహిళలను వెంటపడి కొట్టారని అన్నారు. మహిళలపై దాడి చేసిన టిడిపి ఇంచార్జీ ప్రవీణ్ కు టిడిపి నేతలు అచెన్నయుడు, సోమిరెడ్డి సమర్ధించి నాపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటున్నారు.

తన రాజకీయ జీవితంలో ఏనాడూ దౌర్జన్యాలకు, అక్రమాలకు పాల్పడలేదని.. చేతనైతే నిరూపించాలన్నారు. తనలా లోకేష్ నాయుడు, అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి తమ ఆస్తులపై సీబీఐ విచారణ చేయాలని అడుగుతారా? అని ప్రశ్నించారు. రాజకీయాలలో లేనప్పుడు వారి ఆస్తులెంత?, రాజకీయాల్లోకి వచ్చాక వారి ఆస్తులు ఎంత?..సీబీఐ విచారణ చేపట్టాలన్నారు. తాను సీబీఐ అధికారులను కలవడానికి వెళ్ళే ముందు టిడిపి నాయకులకు చెప్పే వెళతానని.. దమ్ముంటే నాతో కలిసి మీపై కూడా సీబీఐ విచారణను కోరండని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version