ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ తడబడ్డారు బీజేపీ ఎంపీ పురందేశ్వరి. అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేశ్, ఎంపీ పురందేశ్వరి పాల్గొన్నారు.

రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద రూ.94.44 కోట్ల వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్టు నిర్వహిస్తున్నారు. అయితే రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ లో అఖండ గోదావరి ప్రాజెక్టు సందర్భంగా బిజెపి ఎంపీ పురంధరేశ్వరి మాట్లాడుతూ తడబడ్డారు. ప్రసంగంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనాల్సింది బోయి… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటూ టంగు స్లిప్ అయ్యారు పురందరేశ్వరి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ తడబడిన బీజేపీ ఎంపీ పురందేశ్వరి pic.twitter.com/TtsyOWcxzE
— BIG TV Breaking News (@bigtvtelugu) June 26, 2025