గంగతో రాంబాబులో ప్రకాష్‌ రాజును తొక్కినట్లు తొక్కుకుంటూ వెళతారు – వైసీపీ ఎంపీ

-

తప్పు మీద తప్పులు చేస్తూ దరిద్రపు వేషాలు శృతిమించితే పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించిన గంగతో రాంబాబు చిత్రం క్లైమాక్స్ లో అధికార మదమెక్కిన ప్రతి నాయకుడు ప్రకాష్ రాజ్ ను తొక్కుకుంటూ వెళ్లినట్లుగానే ప్రజలు తిరగబడి మన పార్టీ నేతల ముఖాన తొలుత ఉమ్మేసి, తొక్కుకుంటూ వెళ్తారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు సొంత పార్టీ నేతలను హెచ్చరించారు.

రాజమండ్రి జైల్లో దోమలు కుట్టి వీర వెంకట సత్యనారాయణ అనే ఖైదీ డెంగ్యూ వ్యాధితో మృతి చెందాడని, టీడీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష చంద్రబాబు నాయుడు గారికి రేపు ఏదైనా అపకారం జరిగితే మనల్ని కాపాడడానికి పోలీసులు, వారి ఆయుధాలు కూడా పనిచేయవని అన్నారు. కరోనా అంటించి గతంలో ఇదే పాలకులు కొందరిని చంపించిన దాఖలాలు ఉన్నాయని, ఇప్పుడు దోమలు కుట్టి చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా అపకారం జరిగితే… ప్రజల నుంచి తమ పార్టీ నాయకులను కాపాడే వారే లేరని, ప్రజలు తిరగబడి తమను తొక్కుకుంటా వెళ్లే పరిస్థితిని తీసుకురావద్దని ఆయన కోరారు.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప గారికి ఒక రూల్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరొక రూలా? అంటూ సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి గారిని ప్రశ్నించారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప గారిపై ఒక వ్యక్తి లోకాయుక్తకు ఫిర్యాదు చేయగా, అవినీతి నిరోధక చట్టం 17A నిబంధన కింద ఆయన్ని విచారించాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరని లోయర్ కోర్టు తేల్చి చెప్తూ ఒక చక్కటి తీర్పు ఇచ్చిందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news