ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై ఎంపీ రఘురామ సంచలన పోస్ట్‌ !

-

ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై ఎంపీ రఘురామ సంచలన పోస్ట్‌ పెట్టారు. యువ గళం పాదయాత్ర ప్రకాశం జిల్లాలో ప్రవేశిస్తున్న సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేసినట్లుగా ఒక ఫ్లెక్సీని తమ పార్టీ వారే వేశారని, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ వేసినట్లయితే, దివంగత నాయకుడు హరికృష్ణ ఫోటో వేసి ఉండేవారని, హరికృష్ణ గారి ఫోటో వేయకుండా ఫ్లెక్సీని ఏర్పాటు చేశారంటే అది తమ పార్టీ వారి పనేనని అన్నారు రఘురామకృష్ణ రాజు.

ఇటువంటి తింగరి వేషాలు వేసేటప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకొని ఉంటే అపహాస్యం పాలై ఉండేవారు కాదన్నారు. యువ గళం పాదయాత్ర నిర్వహిస్తున్న నారా లోకేష్ గారు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా అప్రహతీతంగా తన పాదయాత్రను కొనసాగిస్తున్నారని, వామనుడు మూడు అడుగుల స్థలాన్ని అడిగి రాక్షసుణ్ణి పాతాళానికి తొక్కి వేసినట్లుగా, నారా లోకేష్ గారు కూడా రాక్షసుడిని తొక్కి వేసేటట్టుగా ఎదిగిపోయాడనడంలో సందేహం లేదని అన్నారు. నారా లోకేష్ గారు ఎక్కడ సమావేశం నిర్వహించినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, నెల రోజుల వ్యవధిలోనే పాదయాత్ర చేయలేక ముగిస్తాడని కొందరు ప్రచారం చేశారని.. కానీ నారా లోకేష్ గారు పట్టుదలతో తన పాదయాత్రను కొనసాగిస్తున్నారని రఘురామకృష్ణ రాజు గారు గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news