శాంతి ఎపిసోడ్‌ పై స్పందించిన విజయసాయి..వారి భరతం పడతానని వార్నింగ్‌

-

శాంతి ఎపిసోడ్‌ పై స్పందించారు రాజ్యసభ వైసీపీ పార్టీ సభ్యులు విజయ సాయి రెడ్డి. తన పరువు తీసేందుకు ప్రయత్నించిన వారి భరతం పడతానని వార్నింగ్‌ ఇచ్చారు విజయసాయిరెడ్డి. దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ప్రెగ్నెంట్‌ కావడానికి కారణం విజయసాయిరెడ్డి అంటూ వార్తలు వచ్చాయి. అయితే.. దీనిపై విజయసాయిరెడ్డి స్పందించారు.

Rajya Sabha YCP party members Vijaya Sai Reddy reacted to the peace episode

టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై మా పార్టీ వాళ్ళే నా మీద ఆరోపణలు చేయించారు…..అయినా నేను బాధపడలేదన్నారు. సాయిరెడ్డి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించే మనిషి కాదు…తప్పు చేయను వేంకటేశ్వర స్వామికి తప్ప ఎవ్వరికీ భయపడనని వెల్లడించారు. మూడు రోజులుగా మీడియా ట్రోలింగ్, కథనాలు ఒక ఆదివాసీ మహిళ ను అవమానించారని నిప్పులు చెరిగారు. నా పరువు తీసేందుకు ప్రయత్నం చేశారో అది మా పార్టీ వాళ్ళైనా, ఇతర పార్టీల వాళ్లైన వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు విజయసాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version