పంచాయతీ ఎన్నికల్లో రెండుసార్లు రీకౌంటింగ్..ఫలితం తారుమారు..!

-

ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో ఇవాళ పంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అందులో కొన్ని ప్రాంతాల్లో కొంత మంద్రి ఏకగ్రీవంగా కూడా ఎన్నికయ్యారు. అయితే ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం ఎర్రమాడు పంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రెండుసార్లు కౌంటింగ్ నిర్వహించడంతో ఫలితం తారుమారు అయింది. దీంతో టీడీపీ ఆందోళన చేపట్టింది. తొలుత ప్రకటించిన ఫలితాల్లో ఒక ఓటు తేడాతో తమ అభ్యర్థి గెలిచాడని టీడీపీ నేతలు చెప్పారు.

కానీ వైసీపీ అభ్యర్థి మాత్రం రీకౌంటింగ్ డిమాండ్ చేసారు. రెండుసార్లు రికౌంటింగ్ నిర్వహించిన అధికారులు వైసీపీ అభ్యర్థి గెలిచినట్టుగా ప్రకటించారు అధికారులు. ఈ ఫలితాలను తారుమారు చేశారంటూ.. తెలుగుదేశం నేతలు గొడవకు దిగారు. అధికారులు వైసీపీ అభ్యర్థికి సపోర్టు చేయడం వల్లనే ఫలితం తారు మారు అయిందని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు.  దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ విషయంలో పోలీసులు జోక్యం చేసుకొని ఆందోళన కారులను చెదురగొట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version