స్టార్ హోటళ్లలో నిర్వహించే బార్ల లైసెన్స్ ఫీజులు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ల ఛార్జీలను తగ్గిస్తూ శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రంలో త్రిస్టార్ సహా ఆ పై స్థాయి హోటళ్లలో బార్ల లైసెన్స్ , నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీని తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. లైసెన్స్ ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీని రూ.66 లక్షల నుంచి రూ.25 లక్షలకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. పర్యాటకంతో పాటు ఆతిథ్యరంగానికి ఊతమిచ్చేలా బార్ల రిజిస్ట్రేషన్ ఛార్జీ లైసెన్స్ ఫీజులను తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.
ఏడాదికి లైసెన్సు ఫీజును రూ.5లక్షల మేరకు నాన్ రిఫండబుల్ ఛార్జీ రూ.20లక్షల మేరకు నిర్దారిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలోనే ఎక్కడా లేనంతా ఎక్కువగా ఉన్న ఫీజులు, ఛార్జీలను తగ్గించాలంటూ ఏపీ హోటళ్లను అసోసియేషన్ చేసిన విజ్ఞప్తి మేరకు కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాలతో సమానంగా లైసెన్స్ ఫీజు, నాన్ రిఫండబుల్ ఛార్జీని తగ్గించాల్సిందిగా ఏపీ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చేసిన ప్రతిపాదనల మేరుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.