నగరిలో ఎవరికి టిక్కెట్ ఇచ్చినా పర్వాలేదు – మంత్రి రోజా

-

నగరిలో ఎవరికి టిక్కెట్ ఇచ్చినా పర్వాలేదని మంత్రి రోజా పేర్కొన్నారు. నేను జగనన్న సైనికురాలిని ..జగనన్న కోసం ప్రాణమైనా ఇస్తానని స్పష్టం చేశారు రోజా.గత కొన్ని రోజులుగా మంత్రి రోజాపై ఓ ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో రోజాకు టికెట్‌ ఇవ్వరని..ఈ మేరకు సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అయితే.. దీనిపై మంత్రి రోజా స్పందించారు.

roja about nagari ticket

తిరుమల శ్రీవారిని ఇవాళ మంత్రి రోజా దర్శించుకున్నారు.ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ….రాబోవు ఎన్నికలో రోజాకు టికెట్‌ రాదని కొంత మంది శునకానందంతో చేస్తున్న ప్రచారం మాత్రమేనని తేల్చి చెప్పారు. గడప గడపకు మొదలుకోని అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో ముందు వరుసలో నేనే వుంటున్నానని వెల్లడించారు మంత్రి రోజా. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కే సీట్లు లేకుండా రెండేసి నియోజకవర్గాలలో సర్వే చేయించుకుంటున్నారని చురకలు అంటించారు. నేను జగనన్న సైనికురాలుని…ఆయన మాటే నాకు శిరోధార్యమని తెలిపారు మంత్రి రోజా.

Read more RELATED
Recommended to you

Latest news