భువనేశ్వరి, బ్రహ్మణి అబద్ధాలు చెప్తుంటే.. ఎన్టీఆర్ గౌరవం కూడా పోతుంది – రోజా

-

భువనేశ్వరి, బ్రహ్మణి అబద్ధాలు చెప్తుంటే ఎన్టీఆర్ కూతురు, మనవరాలు అనే గౌరవం కూడా పోతుందంటూ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కె రోజా షాకింగ్‌ కామెంట్స్ చేశారు. చంద్రబాబు టీమ్ వర్క్ గా కుటుంబసభ్యులంతా దోపిడీలో భాగస్వామ్యం అయినట్టు ప్రజలకు స్పష్టమైందని మండిపడ్డారు. విజయవాడలోని తుమ్మలపల్లిలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు జరిగాయి.

roja comments again on cbn family

ఈ సందర్భంగా పర్యాటకులకు విశేష సేవలు అందించిన హోటల్స్ కు అవార్డులు అందించిన మంత్రి రోజా… అనంతరం మాట్లాడారు. పర్యాటక రంగంలో అనేక మార్పులు వస్తున్నాయని.. ప్రకృతి అందాలు, సాంస్కృతిక వైభవం కలిగిన ప్రాంతం మన దేశం అన్నారు. లోకేష్ రాష్ట్రపతిని కలిసి తప్పు చేసిన తన తండ్రిని కాపాడాలని కోరారని.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రయోజనాల కోసం లోకేష్ రాష్ట్రపతిని కలిసిన దాఖలాలు లేవని మండిపడ్డారు. లోకేష్ ఢిల్లీలో మోడీ, అమిత్ షా కాళ్ళు పట్టుకోవడానికి తిరుగుతున్నారు…అడ్డంగా దొరికిన చంద్రబాబును కాపాడేందుకు ఎవరూ సిద్ధంగా లేరని చురకలు అంటించారు. మోడి, అమిత్ షా అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు… చంద్రబాబు స్కిల్ డెవెలప్ మెంట్ సహా అమరావతి, ఫైబర్ నెట్ వంటి అనేక స్కాం లు చేసారని ఆరోపించారు రోజా.

Read more RELATED
Recommended to you

Latest news