నీతా అంబానీకి ప్రతిష్టాత్మక ‘సిటిజన్ ఆఫ్ ముంబై’ అవార్డు..!

-

 

Nita Ambani : రిలయన్స్ ఇండస్ట్రి అధినేత ముఖేష్ అంబానీ గురించి ఆయన సంపన్నమైన జీవితం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖేష్ అంబానీ ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు ప్రతి విషయంలో కూడా లగ్జరీ గానే ఆయన తన జీవితాన్ని కొనసాగిస్తారు. ఇప్పటికీ ఇండియా లోనే టాప్ ఫైవ్ ధనికుల్లో ఒకరు ముఖేష్ అంబానీ.

Nita Ambani Receives The Citizen of Mumbai Award 2023-24
Nita Ambani Receives The Citizen of Mumbai Award 2023-24

అయితే… రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీకి మరో అరుదైన గౌరవం దక్కింది. నీతా అంబానీ రోటరీ క్లబ్ ఆఫ్ బాంబే నుండి 2023-24 ప్రతిష్టాత్మక ‘సిటిజన్ ఆఫ్ ముంబై’ అవార్డును అందుకున్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, క్రీడలు, కలలు మరియు సాంస్కృతిలో పరివర్తనాత్మక సంస్థలను రూపొందించడానికి ఆమె నిరంతర కృషిని గుర్తిస్తూ… ఈ అవార్డు అందించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యంత విజయవంతమైన క్రికెట్ జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్ కు అంబానీ యాజమాని.

Read more RELATED
Recommended to you

Latest news