రాబోయే రోజుల్లో అంత మంచే జరుగుతుంది – సజ్జల

-

రాబోయే రోజుల్లో అంత మంచే జరుగుతుందని వెల్లడించారు సజ్జల రామకృష్ణా రెడ్డి. వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జయంతి వేడుకలు జరిగిన సందర్భంగా సజ్జల మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైస్సార్ అభిమానులకి శుభాకాంక్షలు చెప్పారు.

వైఎస్సార్ స్ఫూర్తి నుండి పుట్టిన పార్టీ వైస్సార్సీపీ అని… జగన్ రాష్ట్ర అభివృద్ధి కోసం పేద ప్రజల కోసం పని చేసారని వివరించారు. గత 5 ఏళ్ళల్లో ఇచ్చిన హామీలు అన్ని అమలు చేసి ఓట్లు అడిగామన్నారు. అయినా ఫలితాలు వేరుగా వచ్చాయని వెల్లడించారు.

రాజకీయాలలో ఒడి దుడుకులు కామన్ అని… రాష్ట్ర పరిస్థితి దారుణంగా ఉందన్న కూటమి అమలు కానీ హామీలు ఇచ్చారని పేర్కొన్నారు. రాష్ట్ర పరిస్థితి తెలిసి చంద్రబాబు ఎలా హామీలు ఇచ్చాడు..గత పాలనలో కులం మతం చూడకుండా పథకాలు ఇచ్చామన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక దాడులు పెరిగాయని గుర్తు చేశారు. కూటమి వచ్చాక అన్ని వ్యవస్థలను బలహీన పరుస్తున్నారని ఆగ్రహించారు సజ్జల రామకృష్ణా రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version