చంద్రబాబు ఏజెంట్ గా పురంధరేశ్వరి పని చేస్తున్నారు – సజ్జల

-

చంద్రబాబు ఏజెంట్ గా పురంధరేశ్వరి పని చేస్తున్నారని సజ్జల వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. లక్ష్మి పార్వతిని ఎన్టీఆర్ లక్షల మంది ముందు పెళ్లి చేసుకున్నారని… లక్ష్మీ పార్వతి ని ఎన్టీఆర్ ధర్మపత్నీగా ప్రజలు ఒప్పుకున్నారని తెలిపారు.

ఎన్టీఆర్ నాణెం విడుదల సందర్భంగా లక్ష్మి పార్వతి ని పిలవకుండా ఎన్టీఆర్ ఆత్మ క్షోభకు గురి చేశారని నిప్పులు చెరిగారు. బీజేపీ, చంద్రబాబుని కలపడానికే పురంధరేశ్వరి ని బీజేపీ అధ్యక్షురాలిగా పెట్టారు….బీజేపీ, టీడీపీ కలపాలని అనుకుంటే ఎవరు అపుతారు.? అంటూ పేర్కొన్నారు. చంద్రబాబు భావజాలం అంటే ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాన్ని నాశనం చేయడం అంటూ మండిపడ్డారు.

చంద్రబాబు బఫూన్ కి ఎక్కువ.. జోకర్ కి తక్కువ అన్నారు సజ్జల. అసలు ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలో చంద్రబాబుకి క్లారిటీ లేదన్నారు సజ్జల. బీజేపీతో పొత్తుకోసం చంద్రబాబు తహతహలాడుతున్నారు. రాష్ట్రపతి నిలయాన్ని రాజకీయాలకు వేదికగా మార్చారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news