రఘురామ రాజును ఓడించేందుకు సాక్షి ఛానల్ లేడీ యాంకర్ !

-

నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి తనపై పోటీ చేయడానికి వైకాపాకు అభ్యర్థులు దొరకడం లేదని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. అభ్యర్థుల దొరకక చివరకు తన బావగారిని తనపై పోటీకి దింపాలని చూశారని, ఆయన ససేమిరా అనడంతో ఇతర రాజు, కాపు నేతలతో సంప్రదింపులు జరిపారని తెలిపారు.

ఎవరు కూడా పోటీ చేయడానికి ఆసక్తిని ప్రదర్శించలేదని, దీనితో గతంలో సాక్షి మీడియాలో యాంకర్ గా పనిచేసిన, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సన్నిహితురాలు అయిన శ్వేతా వర్మ గారిని బరిలోకి దించాలని చూస్తున్నట్లు తెలిసిందని అన్నారు. దుబాయిలో స్థిరపడిన శ్వేతా వర్మ గారిని ఎన్నికల్లో పోటీ చేయడానికి వెనక్కి రావాలని కోరిన వైకాపా నాయకత్వం, చివరకు ఆమెనైనా అధికారికంగా అభ్యర్థిగా ప్రకటిస్తుందా? లేదా?? అన్నది చూడాలని రఘురామకృష్ణ రాజు గారు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news